బిగ్ బాస్ 5 : రెండో కంటెస్టెంట్ ఖరారు

బిగ్ బాస్ అభిమానులకు గుడ్ న్యూస్. అతి త్వరలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలు కానుంది. ఏప్రిల్ లేదా మే నెలలో బిగ్ బాస్ 5 ప్రారంభం కాబోతుంది. హోస్ట్ గా మరోసారి నాగార్జుననే వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ యాజమాన్యం కంటెస్టెంట్స్ కోసం వేట షురు చేసింది. అంతేకాదు.. తొలి కంటెస్టెంట్ ని కూడా ఎంపిక చేసిందనే వార్తలు ఇటీవల వినిపించాయి.
లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? బిగ్ బాస్ 5 కోసం రెండో కంటెస్టెంట్ ని కూడా ఎంపిక చేశారట. న్యూస్ ప్రజెంటర్ స్వర్ణ రోజాని తీసుకున్నారట. ప్రస్తుతం హెచ్ఎంటీవీలో న్యూస్ ప్రజెంటర్‌గా పనిచేస్తోన్న రోజాకు మంచి ఫాలోయింగ్ ఉంది.

బిగ్‌బాస్‌లో గత సీజన్‌లలో కొంతమంది న్యూస్ రిపోర్టర్‌లు, ప్రజెంటర్‌లు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఉండబోయే బిగ్‌బాస్ ఐదో సీజన్ కోసం రోజాను తీసుకునే అవకాశం ఉంది. ఆమె దాదాపు ఓకే అయిందని చెబుతున్నారు. ఇక బిగ్ బాస్ 5 కోసం యాంకర్ రవి, హైపర్ ఆది, టిక్ టాక్ దుర్గారావు, యాంకర్ వర్షిణి, టిక్ టాకర్ దీపికా పిల్లి, యూట్యూబర్ షణ్ముఖ్, సింగర్ మంగ్లీ.. తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయ్. మరీ వీరిలో ఎవరు బిగ్ బాస్ ఇంట్లోకి వస్తారు అనేది తెలియాలంటే.. కొన్నాళ్ల పాటు వెయిట్ చేయాల్సిందే. 

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేతగా అభిజిత్ నిలిచిన సంగతి తెలిసిందే. రన్నర్ గా అఖిల్ నిలిచారు. అయితే వీరిద్దరి కంటే ఎక్కువగా సోహైల్ హైలైట్ అయ్యారు. ఏకంగా మెగాస్టార్ కళ్లలో పడ్డాడు. మెగాస్టార్ నుంచి వరాలు పొందాడు. మెగా అభిమానులకి దగ్గరయ్యాడు. బిగ్ బాస్ నుంచి బయటిరాగానే హీరోగా తొలి సినిమాని పట్టాలెక్కించాడు. ఈ సినిమాకు చిరు సపోర్ట్ చేయడంతో పాటు.. గెస్ట్ రోల్ లో కనిపించే ఛాన్స్ ఉంది. మొదటి మూడు సీజన్స్ లో పోలిస్తే.. నాల్గో సీజన్ లో పాల్గొన్న వారికి మంచి పేరొచ్చింది. బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత వారికి అవకాశాలు పెరిగాయ్. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లో పాల్గొనేందుకు పలువురు ఆసక్తిని చూపిస్తున్నారు.