బుచ్చిబాబు కోసం ముగ్గురు స్టార్ హీరోలు

తొలి సినిమా ‘ఉప్పెన’ రిలీజ్ కాక‌ముందే.. వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి బిజీ అయిపోయారు. ఈ సినిమా దర్శకుడు బాబు కూడా.. అంతే బిజీ. రెండో సినిమా కూడా మైత్రీ మూవీస్ లోనే చేయ‌బోతున్నాడు బుచ్చి బాబు. అంతేకాదు..రెండో సినిమాకి స్టార్  హీరోని ఇస్తామని హామీ ఇచ్చారట. మూడు ఆప్ష‌న్లు కూడా ఇచ్చేశారు. ఆ హీరోలే.. ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌… చ‌రణ్‌.

ఈ ముగ్గురి కాల్షీట్లూ.. మైత్రీ ద‌గ్గ‌రే ఉన్నాయి. కాబ‌ట్టి.. బుచ్చి ఎవ‌రిని ఒప్పిస్తే… వాళ్లతో మైత్రీ సినిమా ప్ర‌క‌టించేస్తుంది. ప్రభాస్ తో ఇప్పటికిప్పుడు సినిమా అంటే కుదరనని. ప్రస్తుతం రాధేశ్యామ్ తో బిజీగా ఉన్న ప్రభాస్.. సలార్, ఆదిపురుష్ సినిమాలని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లారు. వీటిని పూర్తి చేసి నాగ్ అశ్విన్ సినిమా చేయాలి. ఇదీగాక మిర్చి కాంబో రిపీట్ కానుంది. ప్రభాస్ 25వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉండనుందని సమాచారమ్.

ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఇంకా ఫిక్స్ కాలేదు. చరణ్ ని ఒప్పించాలంటే కథ రెడీగా  ఉండాలి. ఇక ఎన్టీఆర్ తో బుచ్చికి మంచి బాండింగ్ ఉంది. నాన్న‌కు ప్రేమ‌తో.. సినిమా కి బుచ్చి స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశాడు. ఆ స‌మ‌యంలోనే ఎన్టీఆర్‌కి ఓ క‌థ చెప్పాడు బుచ్చిబాబు. అన్నీ కుదిరితే.. ఎన్టీఆర్ తోనే బుచ్చిబాబు సినిమా ఉండొచ్చుని తెలుస్తోంది.