అర్జున్ రెడ్డి బామ్మ దాన‌మిచ్చిన స్థ‌లంలో.. టీటీడీ ఆల‌యం !

అల‌నాటి న‌టీమ‌ణి కాంచ‌న గుర్తుందా ? టాలీవుడ్ సంచలనం ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నాయనమ్మ పాత్రలో నటించింది. దైవ‌భ‌క్తి మెండుగా క‌లిగిన కాంచ‌న చాలా యేళ్ల కింద‌ట చెన్నైలో త‌న సొంత స్థ‌లాన్ని టీటీడీకి విరాళంగా అందించారు. ఇప్పుడు ఆ స్థ‌లంలో అమ్మ‌వారి ఆల‌య నిర్మాణానికి సిద్ధం అవుతోంది టీటీడీ.

సుమారు ఏడు కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు చేసి అమ్మ‌వారి ఆల‌యాన్ని నిర్మించ‌నున్నారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఈ నిర్మాణానికి చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, కంచికామ‌కోటి పీఠాధిప‌తి హాజ‌రుకానున్నారు. కాంచ‌న విరాళ‌మిచ్చిన స్థ‌లం ప్ర‌స్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 30కోట్లు అట. స్థ‌లాల విలువ‌లు ఈ స్థాయికి చేర‌ని రోజుల్లో కాంచ‌న దాన్ని కొనుగోలు చేసి ఉండొచ్చు. అయితే ఆమె విరాళం విలువ ఇప్పుడు ఏకంగా 30 కోట్ల రూపాయ‌ల‌కు చేరింది అన్నమాట.