బీజేపీ, కాంగ్రెస్‌ల బతుకెంత..? తిరగబడితే ప్రధానమంత్రిని కూడా వదలం !

బీజేపీ, కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు సీఎం కేసీఆర్‌పై మాట్లాడితే ఊరుకోమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. బీజేపీ ఒక్క సీటు గెలిచి ఎగిరిపడుతోందని కేటీఆర్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రెచ్చగొట్టడం తప్పితే.. ఆయనతో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు.

ఓపికకు హద్దులుంటాయని.. హద్దు దాటి మాట్లాడవద్దని కేటీఆర్ అన్నారు. తాము తిరగబడితే ప్రధానమంత్రిని కూడా విడిచిపెట్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రులను ఉరికించామని కేటీఆర్‌ అన్నారు. ఇప్పుడున్న బీజేపీ, కాంగ్రెస్‌ల బతుకెంత అని నిలదీశారు.

ఎప్పుడూ కూల్ గా కనిపించే రామన్న.. ఇలా రెచ్చిపోవడం ఏంటీ ? అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఫలితాలే కేటీఆర్ లో మార్పుకు కారణమని తెలుస్తోంది. మర్యాదగా మాట్లాడితే పని జరగడం లేదని కేటీఆర్ కు అర్థమైనట్టుంది. అందుకే.. ఆయన అగ్రెసివ్ పాలిటిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు.