బాలయ్య, ఎన్టీఆర్’లతో మైత్రీ సినిమాలు

నందమూరి అభిమానులకి ఓ తీరని కోరిక ఉంది. అదే నందమూరి మల్టీస్టారర్. బాబాయ-అబ్బాయ్ బాలయ్య-ఎన్టీఆర్ కలిసి నటిస్తే చూడాలని ఆశపడుతున్నారు. బాలయ్య బాబాయ్ తో కలిసి నటించేందుకు తాను సిద్ధమని తారక్, మంచి కథ దొరికితే తారక్ తోనూ కలిసి నటిస్తానని బాలయ్య ప్రకటనకే పరిమితం అవుతున్నారు. వీరిద్దరి కలిపి సినిమాలు చేసేందుకు ఏ దర్శకుడు ప్రయత్నం చేయలేదు. దీంతో నందమూరి అభిమానుల కోరిక.. తీరిక కోరికలా ముగిలిపోతోంది. ఈ విషయం పక్కనపెడితే.. బాలయ్య, ఎన్టీఆర్ లతో ఒకే టైమ్ లో సినిమాలు చేసేందుకు మైత్రీ మూవీస్ ప్లాన్ చేస్తోంది.

ఇటీవల ‘క్రాక్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మైత్రీ మూవీస్ నిర్మించనుంది. ఇది కూడా క్రాక్ మాదిరిగా మాస్ ఎంటర్ టైనర్ అని మైత్రీ నిర్మాతలు తెలిపారు. ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్ టీఆర్ సినిమా ఉండనుంది. ప్రస్తుతం ప్రశాంత్  నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత తారక్ తోనే ఆయన సినిమా ఉండనుంది. ఈ సినిమాని మైత్రీ మూవీస్ నిర్మించనుంది. బాలయ్య, తారక్ సినిమాలని దాదాపు ఒకే టైమ్ లో సెట్స్ మీదకు వెళ్లనున్నాయని తెలుస్తోంది.