#RC15 కోసం ముగ్గురు దర్శకులు

ఎన్టీఆర్. రామ్ చరణ్ కథానాయకులుగా  రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీంగా తారక్‌ కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత తారక్ త్రివిక్రమ్ సినిమాలో నటించనున్నారు. దీంతో పాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ని లైన్ లో పెట్టేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ చేయబోయే రెండు సినిమాలు ఖరారయ్యాయ్. మరోవైపు ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఏంటీ ? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. #RC15 కోసం ముఖ్యంగా ముగ్గురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

తమిళ దర్శకులు శంకర్, లోకేశ్‌ కనకరాజ్‌, తెలుగు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ఈ జాబితాలో నిలిచారు. ఈ డైరెక్టర్లు చరణ్‌కి కథ చెప్పారని, దాదాపు అన్నిస్క్రిప్ట్ లు ఆయనకు నచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి రామ్‌ చరణ్‌ తన 15వ సినిమాకు ఎవర్ని దర్శకుడిగా ఎంపిక చేసుకుంటారు ? అన్నది ఆసక్తిగా మారింది. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారమ్. దర్శకుడు శంకర్ తో సినిమా చేసేందుకు చరణ్ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మిగితా ఇద్దరు దర్శకులని కూడా చరణ్ ఓకే చేసే అవకాశాలు కూడా ఉన్నాయట.