కొడాలి నానిపై కేసు పెట్టండి.. నిమ్మగడ్డ ఆర్డర్ !

ఏపీ పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. ఈమేరకు కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందున ఐపీసీ సెక్షన్లు 504, 505, 506 కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నికల కమిషర్‌పై నాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ ఈ ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి కొడాలి నాని శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఎస్‌ఈసీని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాలేదు. ఆయనకు, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కు పరీక్ష చేయించి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో వారికి తగిన వైద్యం అందించాలి. తర్వాత విడతల్లో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో జగన్‌ ప్రభంజనాన్ని, వైకాపా గెలుపును చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్‌ వీళ్లంతా కట్టగట్టుకుని అడ్డం నిలబడినా ఆపలేరు. జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోతారని అన్నారు. వీళ్లంతా డ్రామా ఆర్టిస్టులు. నిమ్మగడ్డ రమేశ్‌, చంద్రబాబు వేర్వేరని రాష్ట్రంలో ఎవరూ అనుకోవట్లేదు. మంత్రి నాని ప్రెస్ మీట్ పెట్టిన గంట వ్యవధిలోనే ఆయనకి ఈసీ నోటీసులు జారీ చేయడం విశేషం.