ఈషా ఓపెన్ చేసింది. కానీ.. !

యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా సినిమాల కన్నా.. ఆమె కొత్త ఫోటోల కోసం ఎదురు చూసే అభిమానులే ఎక్కువ. వరుసగా ఫోటో షూట్స్ తో సందడి చేయడం ఈషాకు అలవాటు. ఆమె నుంచి కొత్త ఫోటోలు రాకపోతే.. అభిమానులు నిరాసపడిపోతారు. ఐతే ఈషా ఎప్పుడూ అభిమానులని నిరాశపరచదు. గ్యాప్ రాకుండా ఫోటో షూట్స్ చేస్తుంటుంది. వాటిని అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఈషా రెబ్బా కొత్త ఫోటోలు వచ్చాయ్. కిర్రాక్ పోజులిచ్చింది. అందంగా కనిపిస్తోంది. కానీ ఫోటోలు జూమ్ అవుట్ గా ఉన్నాయి. దీంతో.. ఈషా అందాలని స్పష్టంగా చూడలేకపోతున్నామని అబిమానులు అంటున్నారు. మరీ.. వారి బాధని అర్థం చేసుకొని.. ఈషా జూమ్ లోకి వస్తుందేమో చూద్దాం.

ఇప్పటికే ఈషా రెబ్బా మంచి నటి అనిపించుకుంది. కానీ బిజీ హీరోయిన్ కాలేకపోయింది. ఇందుకోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హాట్ గా కనిపించేందుకు రెడీ, గ్లామర్ పాత్రల్లోనూ నటిస్తానని ఓపెన్ ఆఫర్ ఇస్తోంది. మరీ.. ఆమె ఆఫర్ ని ఎవరు వాడుకుంటారో చూడాలి. ఓ వైపు ఫోటో షూట్స్ చేస్తూనే.. మరోవైపు తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతోంది ఈషా.

ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించనున్న ‘శాకుంతలం’లో ఈషాకి కీలక పాత్ర దొరికింది. ఇందులో ఆమె సామ్ కి స్నేహితురాలిగా కనిపించనుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.