134 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. టీమిండియాకు 195 పరుగుల ఆధిక్యం !

చెపాక్ వేదికగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 134 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 195 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ లో బెన్ ఫోక్స్ 42* టాప్ స్కోరర్.

తొలి టెస్టులో ఆశామే హద్దుగా చెలరేగి ఆడిన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ 6 పరుగులకే అవుటయ్యాడు. పోప్ 22, స్టోక్స్ 18 పరుగులు చేశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తండటంటో టీమిండియా స్పిన్నర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా అశ్విన్ వేసిన బంతులని ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ తికమకపడ్డారు. స్పిన్నర్ ఆశ్విన్ 5, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ చెరో రెండు, సిరాజ్ ఒక్క వికెట్ పడగొట్టారు.