‘నీ చిత్రం చూసి.. నా చిత్తం చెదిరి.. ‘

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరి’. ఏప్రిల్ 16న లవ్ స్టోరిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వాలంటైన్ డే కానుకాగా ఈ సినిమా నుంచి ‘నీ చిత్రం చూసి.. నా చిత్తం చెదిరి..’ పాటని విడుదల చేశారు. మిట్టపల్లి సురేందర్ రాసిన పాటని అనురాగ్ కులకర్ణి పాడారు. పవన్ సీహెచ్ సంగీతం అందించారు. సాంగ్ చాలా బాగుంది.

ఇందులో ఆంధ్రా అమ్మాయిగా సాయి పల్లవి, తెలంగాణ కుర్రాడిగా సాయి పల్లవి కనిపిస్తారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని దోచేసింది సాయి పల్లవి. ఆయన దర్శకత్వంలో సాయి పల్లవి నటిస్తున్న రెండో సినిమా ఇది. అయితే క్లైమాక్స్ విషాదాంతంగా ఉంటుందని సమాచారమ్.