#RCBకి ఓకే చెప్పిన మ్యాక్స్ వెల్ 

ఐపీఎల్-14 కోసం మరో రెండ్రోజుల్లో వేలం జరగనుంది. అయితే పంజాబ్ జట్టు వదులుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్ వెల్ ని తీసుకొనేందుకు చెన్నై, బెంగళూరు జట్లు రెడీ అవుతున్నాయనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మాక్స్ వెల్ స్పందించారు. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున ఆడాలని ఉందన్నాడు.

తనకిష్టమైన డివిలియర్స్‌, కోహ్లీతో పనిచేయడం సంతోషమని అన్నాడు. వాళిద్దరితో తనకు మంచి అనుబంధం ఉందని, కోహ్లీతో బాగా కలిసిపోతానని చెప్పాడు. ‘విరాట్‌ సారథ్యంలో ఆడటం, అతడితో కలిసి బ్యాటింగ్‌ చేయడం నాకెంతో ఇష్టం. అతడితో త్వరగా కలిసిపోతా. ఎప్పుడు కలిసినా కోహ్లీ ఏదో ఒక విషయంలో సాయపడుతుంటాడు. అతడో అత్యుత్తమ క్రికెటర్‌. కాబట్టి కోహ్లీతో కలిసి ఆడటం చాలా బాగుంటుంది’ అని మాక్సీ పేర్కొన్నాడు.