‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్.. సర్వం సిద్ధం !


మెగా హీరోలందరినీ మురిపించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రమిది. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజే కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఏకంగా రూ. 10కోట్లు వసూలు చేసింది. మూడ్రోజుల్లోనే రూ. 50కోట్లు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఉప్పెన టీమ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి రెడీ అయింది. 

రాజమండ్రి వేదికగా ఉప్పెన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈ సాయంత్రం జరగనున్నాయ్. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ మైత్రీ మూవీస్ ట్విట్ చేసింది. వేదిక ఫోటోలని ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. రాజమండ్రిలోని మారగాని ఎస్టేట్స్ ని అద్భుతంగా ముస్తాబు చేశారు. ఉప్పెన షూటింగ్ ఎక్కువగా భాగం రాజమండ్రిలోనే జరిగింది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ ని కూడా అక్కడే నిర్వహిస్తున్నారు.