పొలిటికల్ ఎంట్రీపై యాక్షన్ కింగ్ క్లారిటీ

యాక్షన్ కింగ్ అర్జున్ ఎప్పుడో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ట్రెండ్ సెట్ చేశారు. ఒకే ఒక్కడు అనిపించుకున్నాడు. అయితే ఇదంతా రీల్ కథ. శంకర్ దర్శకత్వంలో అర్జున్ కథానాకుడిగా నటించిన ఒకే ఒక్కడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో అర్జున్ రాజకీయాల్లోకి రావాలిని.. ఆయనకు ఆహ్వానాలు అందుతున్నట్టు వార్తలు వినిపించాయి. తాజాగా అర్జున్ చెల్లి కుమారుడు ధ్రువసార్జా, రష్మిక జంటగా నటించిన ‘పొగరు’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ స్పందించారు. క్లారిటీ ఇచ్చారు.

“నాకు నచ్చిన సినిమా రంగంలో చాలా సంతోషంగా ఉన్నా. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని చాలా మంది నన్ను అడుగుతున్నారు. నిజానికి రాజకీయాలకు నేను అస్సలు పనికిరాను. ఆ తెలివితేటలు నాకు లేవు. చిన్న కావాలన్నా.. టాలెంట్‌ ఎక్కువగా ఉండాలి. ‘ఒకేఒక్కడు’ సినిమాలో మాదిరిగా సీఎంగా మారి.. ఆ స్థాయిలో ప్రజలకు సేవలు చేయడం సాధ్యంకాని పని. అలా ఎవరూ రాలేరు” అని చెప్పుకొచ్చారు.