హైకోర్టులో కొడాలి నానికి ఊరట

ఏపీ మంత్రి కొడాలి నాని ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకొంది. ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడకుండా నిలువరిస్తూ ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే దీనిని సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిని హైకోర్ట్ విచారించింది. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడొచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఎస్‌ఈసీ, ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది.