జాతీయ మీడియా పట్టించుకోవట్లే.. రేవంత్ ఆవేధన !

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గత 10 రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన దక్కుతోంది. అంతకుమించి ఈ పాదయాత్ర ద్వారా రేవంత్ లక్ష్యం నెరవేరుతోంది. ఆయనకు పార్టీ సీనియర్లు, కీలక నేతలు మద్దతు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో.. రేవంత్ కు పీసీపీ పోస్ట్ రావడానికి లైన్ క్లియర్ కానుంది.

అయితే రేవంత్ పాదయాత్రని జాతీయ మీడియా పెద్దగా కవర్ చేయడం లేదు. దీనిపై తాజాగా రేవంత్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత పదిరోజులుగా చేస్తున్న పాదయాత్రకు సంబంధించిన ఓ వీడియోని రేవంత్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. పదిరోజులుగా రైతుల తరుపున గళం విప్పితుంటే జాతీయ పట్టించుకోవడం లేదని కామెంట్ పెట్టాడు. అంతేకాదు.. కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలకు ట్యాగ్ చేశారు.