కొత్త దంపతులకు ప్రభాస్ సప్రైజ్ గిఫ్ట్

ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ వివాహానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వస్తాడని అందరూ భావించారు. ఎందుకంటే ? ప్రభాస్ కు వర్షం, పౌర్ణమి లాంటి బ్లాక్ బస్టర్  హిట్స్ ఇచ్చాడు ఎమ్. ఎస్ రాజు. అయితే ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ సుమంత్ అశ్విన్ వివాహానికి హాజరుకాలేకపోయాడు. కానీ ప్రభాస్ నుంచి కొత్త జంటకు బహుమతులు మాత్రం అందాయ్.

బొకేతో పాటు విలువైన బహుమతులని ప్రభాస్ పంపాడు. ఈ విషయాన్ని సుమంత్ తండ్రి ఎంఎస్ రాజు తన సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. కొత్త దంపతులకు పంపిన గిఫ్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డార్లింగ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు.  ఫిబ్రవరి 13 రాత్రి తన ప్రేయసి దీపికను సుమంత్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా వలన వీరి వివాహం నిరాడంబరంగా జరగింది. ఇండస్ట్రీ నుంచి తేజస్వి మాత్రం హాజరయ్యారు.