IPL చరిత్రలోనే అత్యధిక రేటు పలికిన క్రిస్ మోరీస్


ఐపీఎల్-2021 కోసం వేలం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా యువరాజు సింగ్ (రూ.15) పేరిట రికార్డ్ ఉండేది. ఇప్పుడీ.. ఈ రికార్డ్ బ్రేక్ అయింది. క్రిస్ మోరీస్ ని రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ. 16.5కోట్లకి దక్కించుకుంది. మోరీస్ కోసం పంజాబ్, రాజస్థాన్ జట్లు గట్టిగా పోటీ పడ్డాయి. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రేటుపెట్టి మోరీస్ ని రాజస్థాన్ కైవసం చేసుకుంది.

ఇక పంజాబ్ వదిలేసిన ఆసీస్ హిట్టర్ మాక్స్ వెల్ ని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రూ. 14కోట్లకి దక్కించుకుంది. గత సీజన్ లో మాక్స్ వెల్ ని రూ. 10కోట్లకి పంజాబ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే మాక్స్ వెల్ తీవ్రంగా నిరాశపరిచాడు. కనీసం ఒక్క సిక్స్  కూడా కొట్టలేకపోయాడు. దీంతో.. అతడిని పంజాబ్ జట్టు వదులుకుంది. అయితే అతడి కోసం ఆర్సీబీ ముందు  నుంచే ప్లాన్ చేసుకొని భారీ రేటుకు కొనడం విశేషం.