రవితేజపై ప్రేమని కురిపించిన శృతి

‘క్రాక్’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ మళ్లీ బిజీ అయిపోయింది. ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్’లలో నటిస్తోంది. ఆమె నటించిన వెబ్ సిరీస్ పిట్టకథలు మరికొద్దిసేపట్లో (ఫిబ్రవరి19) ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న’లస్ట్‌ స్టోరీస్‌’కు రీమేక్‌గా ఈ సిరీస్‌ తెరకెక్కింది. నాగ్‌అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఓ కథలో ఆమె నటించారు.

పిట్టకథలు ప్రమోషన్స్ లో పాల్గొన్న శృతిహాసన్.. టాలీవుడ్  హీరోలతో స్ర్కీన్‌ పంచుకోవడంపై స్పందించారు. అల్లు అర్జున్‌తో కలిసి ‘రేసుగుర్రం’లో నటించాను. వృత్తిపట్ల ఆయన అంకితభావంతో పనిచేస్తారు. అలాగే అవసరమైన దానికంటే అదనంగా కష్టపడుతుంటారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌ ఫుల్‌ ఎనర్జీతో ఉంటారు. గ్రేస్‌ఫుల్‌. ఇక, రవితేజ గురించి చెప్పాలంటే ఆయన నాకెంతో ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనతో కలిసి ‘బలుపు’, ‘క్రాక్‌’ చిత్రాలు నటించాను. నా హృదయంలో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందని మాస్ మహారాజాపై ప్రేమను కురిపించింది.