ఛార్మితో విజయ్ షికారు


రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటి, నిర్మాత ఛార్మితో కలిసి షికారు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం విజయ్ ‘లైగర్’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ కలిసి పూరి-ఛార్మి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముంబైలో షూటింగ్ లో జరుపుకుంటోంది. సెట్ లో సరదాగా స్కూటీపై ఛార్మి విజయ్ ని ఎక్కించుకొని రైడ్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి తెలిసిందే. అర్జున్ రెడ్డిలో బోల్డ్ నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు లైగర్ తో బాలీవుడ్ ప్రేక్షకులని పలకరించనున్నారు. ఈ చిత్రంలో విజయ్ బాక్సర్ కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం విజయ్ రింగుల జుట్టుతో కొత్త స్టయిల్ లోకి మారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన జంటగా అనన్య పాండే నటిస్తోంది. ఏప్రిల్ 9న లైగర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.