ఒక‌ప్ప‌టి భాగ్య‌న‌ర‌గ‌రానికి పవన్

ఒకప్పటి భాగ్యనగరాన్ని చూపించబోతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బందిపోటు, విరూపాక్షి, వీరమల్లు.. అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో ఓ షెడ్యూల్ ముగిసింది. వ‌చ్చేవారం మ‌రో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం మ‌రో ప‌ది రోజుల డేట్లు ఇచ్చాడు ప‌వ‌న్‌. ఈ ప‌ది రోజుల్లో… కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించనున్నారు.

17వ శ‌తాబ్దం నాటి క‌థ ఇది. భాగ్య‌న‌గ‌ర నేప‌థ్యంలో సాగుతుంది. అప్ప‌ట్లో హైద‌రాబాద్ ఎలా ఉందో, అప్ప‌టి క‌ట్ట‌డాలు ఎలా ఉండేవో చూపించబోతున్నారు. ఇప్పటికే చార్మినార్ సెట్ వేసిన సంగ‌తి తెలిసిందే. చార్మినార్ ఒక్క‌టే కాదు.. హైద‌రాబాద్ లో ఉన్న చారిత్రాత్మ‌క క‌ట్ట‌డాల‌న్నీ..ఈ సినిమా కోసం సెట్స్ రూపంలో మ‌ళ్లీ నిర్మించ‌బోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక‌ప్ప‌టి భాగ్య‌న‌ర‌గ‌రానికి పున‌సృష్టి చేస్తున్నారు.