గదిలో రెచ్చిపోయిన పటానీ


బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మరోసారి రెచ్చిపోయింది. హోటల్ గదిలో కిర్రాజ్ పోజులిచ్చింది. పటానీ సోషల్ మీడియా ఐకాన్ అన్న సంగతి తెలిసిందే. ఆమె ఫోటో షూట్ ఫోటోల కోసం ప్రత్యేకంగా ఎదురు చూసే అభిమాన వర్గం ఉంది. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయిలో ఫాలో వర్స్ ని కలిగి ఉంది.ఇన్ స్టాగ్ర‌మ్ లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న ఇండియ‌న్  హీరోయిన్ల‌లో దిశ టాప్ లో ఉంది. బీచ్ లొకేష‌న్లో టూ పీస్ బికినీతో దుమ్మురేపడం పటానీకి అలవాటు.

అయితే ఈ సారి మాత్రం దిశ రూటు మార్చింది. హోటల్ గదికి షిఫ్ట్ అయింది. గదిలో రెచ్చిపోయింది. ఎద అందాలని ఎరగా వేస్తూ ఫోటోలకి పోజులిచ్చింది. ఆ ఫోటోలని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇప్పుడీ.. పిక్స్ హైరల్ అవుతున్నాయి. పటానీ అందాలని అందాలని ఎన్ని సార్లు చూసిన తనివి తీరదని కామెంట్స్ పెడుతున్నారు.

లోఫర్ సినిమాతో తెలుగు తెరకుపరిచయం అయింది దిశ. ఆ తర్వాత ధోని బయోపిక్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఇక సుకుమార్-అల్లుఅర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్ కోసం దిశ పటానీ పేరు వినిపించింది. ఇదీగాక ప్రభాస్ సలార్ కోసం కూడా పటానీ పేరు వినిపించింది. కానీ శృతి హాసన్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే.