‘ఉప్పెన’పై మహేష్ ప్రశంసలు

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ – కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఈ ముగ్గురుకి ఇదే తొలి సినిమా. మైత్రీ మూవీస్ నిర్మించింది. ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్, మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా హీరోలంతా సపోర్ట్ చేశారు. ఫలితంగా సినిమా జనాల్లోకి వెళ్లింది. తొలిరోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. మూడ్రోజుల్లోనే రూ. 50కోట్లు కలెక్ట్ చేసింది. వందకోట్ల దిశగా పరుగులు పెడుతుంది.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఉప్పెన సినిమాని వీక్షించారు. ట్విట్టర్ వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఉప్పెన చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. “ఉప్పె’ గురించి ఒక మాటలో చెప్పాలంటే క్లాసిక్‌ మూవీ. బుచ్చిబాబు నువ్వొక అరుదైన కాలాతీతమైన సినిమాల్లో ఒక సినిమాను తెరకెక్కించావు. నిన్ను చూసి గర్వపడుతున్నాను. వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి వంటి కొత్త హీరో హీరోయిన్స్‌ తన అభినయంతో హృదయాలను దోచుకున్నారు. మీరు నిజమైన స్టార్స్‌. ఉప్పెన వంటి సినిమాను వెనుక ఉండి సపోర్ట్ చేసిన సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్‌కు అభినందనలు. మీ టీమ్‌ను చూసి గర్వపడుతున్నా”నని రాసుకొచ్చారు.