రంగ్ దే రెండో సింగిల్ వచ్చేసింది 

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్-కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ‘నా కనులు ఎప్పుడు.. ‘ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా సాంగ్ ని రిలీజ్ చేశారు.   ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. సిద్ శ్రీరామ్ ఆలపించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. క్లాస్ ట్యూన్ తో సాగిన సాంగ్ బాగుంది. నితిన్- కీర్తి సురేష్ పై చిత్రీకరించిన విజువల్స్ తో లిరికల్ సాంగ్ ని కట్ చేశారు. నితిన్ నటించిన చెక్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. నెల గ్యాప్ లోనే నితిన్ నుంచి మరో సినిమా రంగ్ దే ప్రేక్షకుల ముందుకు రానుంది.