జిమ్మికులు.. అడ్డదారుల్లో తెరాస గెలవాలని చూస్తోంది !

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిమ్మికులతో, అడ్డదారుల్లో గెలవాలని చూస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ పీవీ నర్సింహారావు ఫొటో పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పీవీ నర్సింహారావు ఘాట్‌ను కూల్చేస్తామన్న పార్టీ తరపున ఎలా పోటీ చేస్తారని వాణిదేవిని ప్రశ్నించారు. సమాజానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 


ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవకుంటే ముఖ్యమంత్రికి అహంకారం తలకెక్కి ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉపాధ్యాయులు, ఉద్యోగస్తుల పేరు చెప్పుకుని మంత్రి పదవి పొందారని.. నేడు వారినే బెదిరించి ఓట్లు రాబట్టేందుకు చూస్తున్నారని చెప్పారు. సొంత మనుషుల బదిలీలు, ప్రమోషన్ల కోసం జీవోలు మార్చిన సంగతి అందరికీ తెలుసు. ముందు వాటిపై దృష్టి పెట్టాలని ఆ తర్వాత తమ గురించి మాట్లాడాలని బండి సంజయ్ హితవు పలికారు.