జాతిరత్నాలు ఫస్ట్ డే కలెక్షన్స్

నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఈ చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. మహాశివరాత్రి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన జాతిరత్నాలు హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, సినీ అభిమానులు జాతిరత్నాలపై ప్రశంసలు కురిపించారు.


హిట్ టాక్ తో జాతిరత్నాలు తొలిరోజు కలెక్షన్స్ కూడా అదిరిపోయాయ్. ఈ సినిమా నైజాంలో రూ. 1.42 కోట్లు, సీడెడ్‌లో రూ. 57 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షలు, ఈస్ట్‌లో రూ. 38 లక్షలు, వెస్ట్‌లో రూ. 28.30 లక్షలు, గుంటూరులో రూ. 39 లక్షలు, కృష్ణాలో రూ. 24.80 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలతో రెండు రాష్ట్రాల్లో రూ. 3.94 కోట్లు షేర్, రూ. 6.55 కోట్లు గ్రాస్ వచ్చింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 8 లక్షలు రాబట్టింది. దీంతో మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.84 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.40 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

ఈ చిత్రం తొలిరోజు నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్, కర్నాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. అయితే తొలి వీకెండ్ తోనే జాతిరత్నాలు లాభాల్లోకి ఎంటర్ కానుంది. ఇది రూ. 50కోట్ల సినిమా ఈజీగా అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే జాతిరత్నాలకు భారీ లాభాలు ఖాయం అన్నమాట.