మలన్’ని తలచుకుంటే భయమేస్తుందట

గతేడాది టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ ఆటగాడు.. మలన్‌ ప్రస్తుతం ఈ ఫార్మాట్‌లో నంబర్‌ వన్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కాగా, నేటి నుంచి ఇంగ్లాండ్‌.. టీమ్‌ఇండియాతో ఐదు టీ20ల సిరీస్‌ ఆడనున్న నేపథ్యంలోనే మోర్గాన్‌ తొలి మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. 


ఈ సందర్భంగా మలన్‌ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మలన్‌ ఎంత దూరం వెళ్తాడో నాకు తెలియదు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి ప్రదర్శన అత్యద్భుతం. అతడిలాగే కొనసాగితే ఏం చేస్తాడోనని భయమేస్తుంది. ఈసారి ఐపీఎల్‌లో పంజాబ్‌ అతడిని కొనుగోలు చేసింది. దాంతో భారత్‌లో ఆడుతూ ఇక్కడ తన అనుభవాన్ని కొనసాగిస్తాడు. రాబోయే రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ ఉండడంతో అది మాకు కలిసివస్తుంది’ అని మోర్గాన్‌ పేర్కొన్నాడు.