తొలి టీ20 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

అహ్మదాబాద్‌ వేదికగా భారత్-ఇంగ్లండ్ ల మధ్య తొలి టీ20 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తాజాగా టాస్ పడింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్  బౌలింగ్ ఎంచుకున్నారు. ఇక రెండు జట్లలోనూ మంచి హిట్టర్లు ఉండటం, పిచ్‌ ఫ్లాట్‌గా ఉండటంతో పరుగుల వరద పారుతుందని అంచనా వేస్తున్నారు.

ఇక ఈ సిరీసుకు 50% మంది అభిమానులను అనుమతిస్తున్నామని గుజరాత్‌ క్రికెట్ సంఘం (జీసీఏ) తెలిపింది. కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టేడియం మొత్తాన్ని శానిటైజేషన్‌ చేయించామని పేర్కొంది. కరోనా ఆంక్షలు, నిబంధనలు అమలు చేసేందుకు కార్యదళాల్ని నియమించామని వెల్లడించింది.