బెంగాల్’లోనూ ఏపీ కోడి కత్తి డ్రామా !?

ఒక బాషలో హిట్టైన చిత్రాన్ని మరో బాషల్లోకి రిమేక్ చేయడం సాధారణమే. ఆ సినిమా రెండు బాషల్లోనూ  హిట్ట్ కావొచ్చు. అప్పుడప్పుడు ప్లాప్ కూడా కావొచ్చు. ఇప్పుడు.. ఏపీలో బ్లాక్ బస్టర్ హిట్టైన కోడి కత్తి డ్రామాని పశ్చిమ బెంగాల్ లోనూ రిమేక్ చేశారు ఎన్నికల వ్యూహా కర్త ప్రశాంత్ కిశోర్ అనే ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న టీఎంసీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు నెట్టేయ‌డంతో ఆమెకు తీవ్ర గాయాలైన విష‌యం తెలిసిందే.నందిగ్రామ్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించి, కారు ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కాలికి తీవ్ర గాయ‌మైంది. ప్ర‌స్తుతం ఆమె ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇదంతా డ్రామా. ఏపీ కోడికత్తి డ్రామాని ప్రశాంత్ కిషోర్ బెంగాల్ కి తీసుకొచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇక పశ్చిమ బెంగాల్ లో హ్యాట్రిక్ కొట్టాలనే కసితో మమతా బెనర్జీ ఉన్నారు. అయితే ఈ సారి ఎలాగైనా దీదీకి కి చెక్ పెట్టాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు ఎత్తులు-పై ఎత్తులు వేస్తున్నాయ్. ఫైనల్ గా పై చేయి ఎవరిది ? అనేది మరికొద్దిరోజుల్లోనే తెలియనుంది.