శివరాత్రి స్పెషల్ షోస్ : వసూళ్లలో ‘సరిలేరు నీకెవ్వరు’

టాలీవుడ్ స్టార్ హీరోలపై సూపర్ స్టార్ మహేష్ బాబు పైచేయి సాధించారు. శివరాత్రి స్పెషల్ షోస్ గా బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రదర్శించబడ్డాయ్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్స్ లో సరిలేరు నీకెవ్వరు తో పాటు రంగస్థలం, సరైనోడు, ఇస్మార్ట్ శంకర్, శ్రీమంతుడు సినిమాల స్పెషల్ షోస్ వేశారు. వీటిలో సరిలేరు నీకెవ్వరు అత్యధికంగా 1.47లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసి టాప్ లో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో రంగస్థలం, సరైనోడు, ఇస్మార్ట్ శంకర్ ఉన్నాయి.


అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు తెరకెక్కింది. మహేష్ కి జంటగా రష్మిక మందన నటించారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ అయింది. సినిమా వచ్చి యేడాది గడిచిన.. ఆ పవర్ తగ్గలేదని శివరాత్రి స్పెషల్ షో తో మరోసారి రుజువైంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట’తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.