పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా పీకల్లోతూ కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్ కె ఎల్ రాహుల్ ఒక్క పరుగుకే పెలివియన్ చేరాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతా కూడా తెరవకుండానే అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 4 పరుగులకే అవుటయ్యారు. దీంతో.. 5 ఓవర్లలో 20 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది.


పిచ్ అనూహ్యంగా టర్న్ అవుతుంది. బంతి ఆగి వస్తుంది. దీంతో పరుగులు చేయడం కష్టం అవుతోంది. అయితే పంత్ మాత్రం తన మార్క్ షాట్స్ తో అలరిస్తున్నారు. ఆర్చర్ బౌలింగ్ లో పంత్ కొట్టిన సిక్స్ మ్యాచ్ కే హైలైట్ గా నిలవనుంది. ప్రస్తుతం పంత్ (16), శ్రేయస్ అయ్యార్ (0) పరుగులతో క్రీజులో ఊన్నారు.