‘ఆట నాది కోటి మీది’ – ఎవరు మీలో కోటీశ్వర్లు ప్రోమో అదిరింది !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి హోస్ట్ గా మారనున్న సంగతి తెలిసిందే. జెమినీ టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ జరుగుతోంది. షో గురించి నిర్వాహకులు ప్రేక్షకులకి వివరిస్తున్నారు. మరికాసేపట్లో తారక్ కూడా మాట్లాడనున్నారు. తాజాగా ఈ షో లెటెస్ట్ ప్రోమోని వదిలారు. ఇందులో యంగ్ టైగర్ తనదైన శైలిలో అదరగొట్టేశారు.

‘ఇక్కడ కల మీది కథ మీది. ఆట నాది కోటి మీది. రండి గెలుద్దాం’ అంటూ సింగిల్ ప్రోమోతో షోకు కేకపుట్టించాడు. ఈ ప్రోమోలకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ మాట తారక్ తోటితో ఉంటే.. ఇంకేమైనా ఉంటుందా.. ? మాటలతోనే యుద్ధం చేసినట్టు.. ఆ యుద్దం వన్ సైడ్ అయినట్టు ఉండదు. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో కూడా అలాగే ఉంది. మీరు ఆ ప్రోమోని ఓసారి చూసేయండీ.. !