లైవ్ : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రెస్ మీట్

లైవ్ : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రెస్ మీట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి హోస్ట్ గా మారనున్న సంగతి తెలిసిందే. జెమినీ టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ షో ప్రోమోస్ వచ్చేశాయ్. ఇప్పుడు స్వయంగా ఎన్ టీఆర్ రంగంలోకి దిగనున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. ఈ షో విశేషాలని ప్రేక్షకులకి వివరించనున్నారు.


బిగ్ బాస్ తెలుగు సీజన్ 1కి తారక్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఏపీసోడ్స్ కి కూడా బిగ్ బాస్ యాజమాన్యం తారక్ ని అడిగింది. కానీ ఆయన సినిమాల్లో బిజీ కావడం వలన ఓకే చెప్పలేదు. అయితే బిగ్ బాస్ ని కాదని.. ఎవరు మీలో కోటీశ్వరులు షోకి తారక్ ఓకే చెప్పడం విశేషం. ఇందుకు గల కారణాలని తాజా ప్రెస్ మీట్ లో తారక్ చెబుతాడేమో చూడాలి.  

తారక్ ప్రెస్ మీట్ ని కింది వీడియోలో మీరు చూసేయండి.. !