కవిత మీద కార్యకర్త అభిమానం చూశారా ?

సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు తెరాస నేతలు, కార్యకర్తలు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. నిజామాబాద్‌కు చెందిన తెరాస యువనేత పబ్బ సాయిప్రసాద్‌ వినూత్నంగా తన అభిమానం చాటుకున్నారు.

హైదరాబాద్‌ రవీంద్ర భారతి వద్ద 60 అడుగుల భారీ రంగోలి వేయించారు. మహారాష్ట్రకు చెందిన రంగోలి చిత్రకారుడు శైలేష్‌ కులకర్ణి చేతుల్లో ఈ కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 20 గంటల పాటు శ్రమించి కళాకారులు ఈ రంగోలి వేశారు. ఈ రంగోలీతో సెల్ఫీ తీసుకునేందుకు సందర్శకులు పోటీపడుతున్నారు.

2014లో నిజామాబాద్ నుంచి ఎంపీ గెలిచిన కవిత 2019 అదే స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచారు. ఇటీవలే కవతకు ప్రజాప్రతినిధుల కోటలో ఎమ్మెల్సీ పదవి దక్కిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమెకు మంత్రిగా ప్రమోషన్ కూడా దక్కనుందనే ప్రచారం కూడా జరుగుతోంది.