కోహ్లీ డకౌట్.. పోలీసులకు ప్రచార అస్త్రం అయింది !

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా ఘోరంగా ఓడింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.ఆపై ఇంగ్లాండ్‌ రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 15.3 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేశారు. 


 ఈ మ్యాచ్ లో టీమ్‌ఇండియా టాప్‌ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. కోహ్లీ పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్‌ చేరాడు. అయితే, కోహ్లీ డకౌటవ్వడంపై ఉత్తరాఖండ్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు. రహదార్లపై ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసేవారికి ఓ వినూత్న సందేశం చేరవేశారు. కోహ్లీ పెవిలియన్‌కు వెళ్తున్న ఫొటోను పంచుకొని.. ‘హెల్మెట్‌ ఒక్కటే సరిపోదు. పూర్తి ధ్యాసతో డ్రైవింగ్‌ చేయడం కూడా అత్యంత ఆవశ్యకం. లేకపోతే కోహ్లీ లాగే మీరూ డకౌట్‌ అవుతారు’ అని హిందీలో పోస్టు చేశారు. ఇప్పుడీ.. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది