ప్రేక్షకులు లేకుండానే మిగతా మూడు టీ20’లు

ఇంగ్లండ్-భారత్ ల మధ్య టీ20 టోర్నీ ఆసక్తిగా సాగుతోంది. తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ ఘన విజయం సాధిస్తే.. రెండో టీ20లో టీమిండియా గెలిచింది. లెక్క సరిచేసింది. దీంతో మిగితా మూడు టీ20 మ్యాచ్ లు ఉత్కంఠగా జరగడం ఖాయం అనుకున్నారు. మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. కానీ వారికి గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(జీసీఏ) షాక్ ఇచ్చింది. 

గుజరాత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మిగతా మూడు టీ20లను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మిగతా మూడు మ్యాచ్‌ల కోసం టికెట్లు కోనుగోలు చేసిన ప్రేక్షకులకు డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు జీసీఏ తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లో సోమవారం ఒక్కరోజే 890 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది