జగన్’కు జై కొట్టిన జేసీ బ్రదర్స్

జేసీ బ్రదర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సీఎం జగన్ కు జై కొట్టారు. సీఎం జగన్ నైతిక విలువలు ఉన్న వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి వైఎస్ఆర్ లాగానే.. జగన్ లో కూడా చాలా విలువలు ఉన్నాయన్నారు. వాటిని ఈరోజు స్వయంగా చూశా. సీఎం జగన్ సహకారం లేకపోతే.. మున్సిపల్ ఛైర్మన్‌ అయ్యేవాడిని కాదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతేకాదు.. త్వరలో సీఎం జగన్ ని కలుస్తా. తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య తో కలిసి పనిచేస్తానన్నారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 

తాడిపత్రిలో వైసీపీ హవాని తట్టుకొని మరీ.. పురపాలక ఎన్నికల్లో జేసీ వర్గం విజయం సాధించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ విజయాన్ని తెదేపా వర్గాలు గొప్పగా చెప్పుకుంటున్నాయ్. ఇలాంటి టైమ్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి షాక్ ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అన్న జేసీ దివాకర్ రెడ్ది కూడా సీఎం జగన్ ని కలుస్తారా ? ఇద్దరు కలిసి ఫ్యాన్ గాలి కిందికి వెళ్తారా ? అన్నది తెలియాల్సి ఉంది.

ఏపీలో సీఎం జగన్ అధికారంలో వచ్చినప్ప’టి నుంచి జేసీ బ్రదర్స్ కి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయ్. వారి వ్యాపారాలు చాలా వరకు ముసేశారు. మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి జేసీ దివాకర్ రెడ్డి సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. చరిత్రలో జగన్ లాంటి వేస్ట్ సీఎం లేడని కామెంట్స్ చేసేవారు. అలాంటి జేసీ బ్రదర్స్ కు ఉన్నట్టుండి జగన్ పై ప్రేమ పెరిగింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరంటే.. ఇదేనేమో.. !