రెజ్లర్ రితికా ఫొగట్ ఆత్మహత్య

రెజ్లింగ్‌ క్రీడాకారిణి రితికా ఫొగట్‌ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని హరియాణా పోలీసులు అనుమానిస్తున్నారు.
 ప్రముఖ రెజ్లర్లు గీతా, బబితా ఫొగట్‌ కజిన్‌ అయిన 17ఏళ్ల రితిక.. మహవీర్‌ ఫొగట్‌ స్పోర్ట్స్ అకాడమీలో రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల భరత్‌పూర్‌లో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్రస్థాయిలో సబ్‌ జూనియర్‌, జూనియర్‌ రెజ్లింగ్‌ పోటీల్లో ఆమె పాల్గొంది.

 ఈ టోర్నీలో ఫైనల్‌ వరకు చేరిన రితిక.. తుది పోటీలో కేవలం ఒకే ఒక్క పాయింట్‌తో ఓటమి చవిచూసింది. దీంతో నాటి నుంచి తీవ్ర కుంగుబాటుకు లోనైన ఆమె.. బుధవారం రాత్రి మహవీర్‌సింగ్‌ ఫొగట్ నివాసంలోనే తన గదిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. టోర్నీలో ఓటమితో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.