TSలో 313 కొత్త కేసులు

తెలంగాణ మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 313 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 142 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,434 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 943 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 


మరోవైపు దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా కొత్త కేసులు సంఖ్య 40వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 39,726 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. క్రితం రోజుతో పోల్చితే 11 శాతం పెరుగుదల కనిపించింది. ఈ మహమ్మారి కారణంగా నిన్న 154 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1.15 కోట్లకు పైబడగా.. 1,59,370 మంది ప్రాణాలు వదిలారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.