ప్రేక్షకులకు థాంక్స్ చెప్పిన జాతిరత్నాలు

అనుదీప్ దర్శకత్వంలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌. మార్చి 11న శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన జాతిరత్నాలు హిట్ టాక్ సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో చిత్రబృందం సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

ఈ సందర్భంగా హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమాలు ఈ సమయంలో ఎంతో అవసరం. మీ స్పందన చూస్తుంటే ఒక కలలా ఉంది. తెలుగు ప్రేక్షకులు మా కలలను నిజం చేశారు. మా సినిమాలో కనిపించే జాతి రత్నాలు నేను, దర్శి, రాహుల్‌ రామకృష్ణ కానీ.. కనిపించని జాతిరత్నాలు నాగ్‌ అశ్విన్‌, ప్రియాంక, స్వప్న. నాగీ ఈ సినిమా కోసం మహానటి కంటే ఎక్కువగా కష్టపడ్డాడు. డైరెక్టర్‌ అనుదీప్ అద్భుతంగా తీశాడు” అని చెప్పుకొచ్చాడు.