‘రంగ్ దే’ సెన్సార్ రివ్యూ

నెల గ్యాప్ లో హీరో నితిన్ నుంచి రెండు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయ్. గత నెల 26న ‘చెక్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నెల 26న రంగ్ దే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. నితిన్‌-కీర్తి సురేశ్‌ జంటగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్  నిర్మించింది. రంగ్ దే ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయ్. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయ్.


ఆ అంచనాలని అందుకొనేలా రంగ్ దే ఉందన్నది సెన్సార్ సభ్యుల నుంచి అందుతున్న టాక్. తాజాగా రంగ్ దే సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ పూర్తయిందన విషయాన్ని తెలియజేస్తూ నితిన్ ట్విట్ చేశారు. ఈ నెల 26 నుంచి రంగ్ దే థియేటర్స్ లో ఫన్ రైడ్ జరగనుందని తెలిపారు. సెన్సార్ సభ్యుల నుంచి అందుతున్న సమాచార్ ప్రచారం.. రంగ్ దే ఎంటర్ టైనింగ్ గా ఉందని తెలుస్తోంది.