పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్.. వాదనలు ముగిశాయ్ !

ఏపీలో ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయ్. ఈ క్రమంలోనే పరిషత్ ఎన్నికలు కూడా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. అయితే మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని  హైకోర్టులో పిటిషన్స్ దాఖలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్స్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది.

ఇక పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ హవా చూపించింది. అత్యధిక స్థానాలని గెలుచుకుంది. ఈ క్రమంలోనే పరిషత్ ఎన్నికలకు కూడా వెళ్లాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నారు. పరిషత్ ఎన్నికలు కూడా పూర్తయితే.. కరోనా వాక్సినేషన్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించవచ్చని సీఎం భావిస్తున్నారు.