బ్రేకింగ్ : తెలంగాణ భవన్ లో అగ్ని ప్రమాదం

తెలంగాణ భవన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భవన్ ముందు ఉన్న పందిరికి మంటలు అంటుకున్నాయి. కాలిపోతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి తెరాస అభ్యర్థి వాణీదేవి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు ఇతర కార్యకర్తలు తెలంగాణ భవన్ ముందు టపాకాయలు కాల్చారు. దీంతో ముందున్న పందిరి అంటుకుంది.

మంత్రి కేటీఆర్, కేసీఆర్, ముఖ్య నేతలు తెలంగాణ భవన్ కి వస్తే ఈ పందిరి కిందే కారు పార్క్ చేసి.. లోనికి వస్తారు. ఇప్పుడీ.. ఈ పందిరి అగ్నికి ఆహుతి అవుతోంది. అయితే తెరాస కార్యకర్తలు నీళ్లతో మంటలని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఫైర్ ఇంజన్ కి సమాచారం అందించారు. ఈలోపు తెరాస నేతలు మంటలు ఆర్పడానికి తమ వంతు ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాణీ దేవి గెలిచిన ఆనందంలో తెరాస నేతలు చేసిన హడావుడిలో చిన్నపాటి విషాద ఘటన చోటు చేసుకుంది.