ఐదో T20 : ఓపెనర్ గా కోహ్లీ.. రాహుల్ స్థానంలో నటరాజన్ !

ఇంగ్లాండ్ తో ఆఖరి టీ20 కోసం టీమిండియా కీలక మార్పు చేసింది. ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓపెనర్ కెఎల్ ని పక్కకు పెట్టింది. ఆయన స్థానంలో మరో బ్యాట్స్ మెన్స్ ని తీసుకోకుండా.. ఎక్స్ ట్రా బౌలర్ ని తీసుకున్నారు. నటరాజన్ కి అవకాశం ఇచ్చారు. దీంతో టీమిండియా బౌలింగ్ మరింత పటిష్టం కానుంది. 


ఇక కెప్టెన్ కోహ్లీ ఓపెనర్ గా మారనున్నారు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. కోహ్లీకి ఓపెనింగ్ చేయడం కొత్తమీ కాదు. గతంలో ఐపీఎల్ లో ఓపెనింగ్ చేసిన అనుభవం కోహ్లీకి ఉంది. ఇక వన్ డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. ఆ తర్వాత ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్, పంత్, హార్ధిక్ పాండ్యా… బ్యాటింగ్ చేయనున్నారు. ఇక టాస్ గెలిచిన  ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయార్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.