ఆఖరి టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ !

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆఖరిదైన ఐదో టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయార్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్ లు గెలిచి సమంగా నిలిచాయ్. ఈ మ్యాచ్ గెలిచి టైటిల్ ని ఎగురవేసుకుపోవాలని భావిస్తున్నాయి.

 
ఇక ఈ మ్యాచ్ లో కె ఎల్ రాహుల్ కి బదులుగా నటరాజన్ ని తీసుకున్నారు. రోహిత్ శర్మతో కలిసి కెప్టెన్ కోహ్లీ ఓపెనింగ్ చేయనున్నారు. ఎక్స్ ట్రా బౌలర్ కావాలనే ఉద్దేశంతోనే రాహుల్ ని డ్రాప్ చేసి నటరాజన్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ కోహ్లీకి ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. కెప్టెన్-వైఎస్ కెప్టెన్ కలిసి ఓపెనింగ్ చేస్తుండటం విశేషం.