‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కొత్త ప్రోమో వచ్చేసింది !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ షోకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించారు. ప్రెస్ మీట్ లో పాల్గొన్న తారక్.. షో కు సంబంధించిన వివరాలని తెలిపారు. ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ఫార్మెట్ లోనే ఎవరు మీలో కోటీశ్వరులు కూడా ఉంటుందని తెలిపారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి కొత్త ప్రోమోని వదిలారు. ఈ ప్రోమో లో ‘జీవితాన్ని మారుద్దాం రామ్మా’ అంటూ ఎన్టీఆర్ ఆహ్వానించడం చూడొచ్చు. గ‌తంలో ఎన్టీఆర్ హొస్ట్ గా  బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 1 ప్రసారం అయింది. సూపర్ హిట్ అయింది. తెలుగు బిగ్ బాస్ ని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెట్టారు తారక్. తారక్ మరోసారి బిగ్ బాస్ షోని టేకప్ చేస్తే చూడాలని అభిమానులు ఆశపడ్డారు. కానీ తారక్ బిగ్ బాస్ కు కాకుండా జెమినీ టీవీకి ఓకే చెప్పారు. ఎవరు మీలో కోటీశ్వరులు షోతో మరోసారి బుల్లితెర ప్రేక్షలని అలరించనున్నారు.