తారక్’తో రస్మిక రొమాన్స్

యంగ్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో రొమాన్స్ చేసింది. వీరిద్దరు కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేస్తోంది రస్మిక. ప్రస్తుతం బన్నీ-సుకుమార్ హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని లైన్ లో పెట్టేసినట్టు తెలుస్తోంది.


ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం హీరోయిన్ గా పూజా హెగ్డే, కియారా అద్వానీ, జాన్వీ కపూర్ పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్ గా రష్మిక మందన ఫిక్సయిందని సమాచారమ్. ఇటీవల రస్మిక త్రివిక్రమ్ ని కలిసింది. కథా చర్చల్లో పాల్గొందట. దీంతో తారక్ పక్కన రస్మిక ఫిక్సయిందని క్లారిటీ వచ్చినట్టయింది. ఇక రాజకీయాల నేపథ్యంలో తారక్-త్రివిక్రమ్ ల సినిమా ఉండనుందని సమాచారమ్. పాన్ ఇండియా సినిమాగా తీసుకొస్తారట.