తొలి వన్డే : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

పూణే వేదికగా ఇంగ్లాండ్ తో తొలి వన్డే కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, ఈ మ్యాచ్ లో టీమిండియాలో రెండు, మూడు మార్పులు కనిపించాయి. ఓపెనర్ శిఖర్ ధావన్ వచ్చేశాడు. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు.

ఇక ఈ మ్యాచ్ లో కృనాల్ పాండే, ప్రసిద్ద కృష్ణని తీసుకున్నారు. వీరిద్దరికి ఇదే తొలి వన్డే మ్యాచ్. రిషబ్ పంత్ ని పక్కకు పెట్టడం విషయం. కె ఎల్ రాహుల్ నే కీపింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇద్దరు స్పిన్నర్లు కుల్ దీప్ యాదవ్, కృనాల్ పాండే, నలుగురు ఫాస్ట్ బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ కృష్ణ, షార్థుల్ ఠాకూర్, హార్థిక్ పాండ్యాలని తీసుకున్నారు.

ఇక టెస్ట్, టీ20 సిరీస్ లని కోల్పోయిన ఇంగ్లాండ్ వన్ డే సిరీస్ ని గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం 4 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. రోహిత్ 4, ధావన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.