బ్రేకింగ్ : తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో మరోసారి లాక్ డౌన్ ఉండదు – కేసీఆర్

దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తెలంగాణలోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయ్. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలని మూసివేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ ప్రచారంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. 

తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా నష్టపోయాం. మరోసారి పరిశ్రమల మూసివేత ఉండదు. విద్యా సంస్థలని కూడా తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రకటించామని తెలిపారు. కాకపోతే.. ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పక మాస్కులు ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. ఇప్పట్లో పెళ్లి ముహూర్తాలు కూడా లేవ్. పెళ్లిళ్లు, పబ్బాలకు కూడా గాదరింగ్ తగ్గించుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి సీఎం కేసీఆర్ సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండదు : అసెంబ్లీలో సీఎం శ్రీ కేసీఆర్@KTRTRS pic.twitter.com/00kjVppYcM— Thirupathi Bandari (@BTR_KTR) March 26, 2021