అంపైర్ తప్పిదమే ఇంగ్లాండ్ నే గెలిపించిందా ?

రెండో వన్డేలో ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని సాధించింది. 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఈజీగా చేధించేశారు. అయితే థర్డ్ అంపైర్ తప్పిదం వలనే ఇంగ్లాండ్ గెలిచిందని టీమిండియా మాజీలు, ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. భువనేశ్వర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 26వ ఓవర్‌ అయిదో బంతిని మిడాన్‌ దిశగా పంపిన స్టోక్స్‌.. రెండో పరుగుకు ప్రయత్నించాడు. కుల్‌దీప్‌ త్రో నేరుగా వికెట్లకు తాకింది. అతను కచ్చితంగా ఔటై ఉంటాడని భారత ఆటగాళ్లు అనుకున్నారు. 


కానీ చాలా సార్లు రిప్లేలో పరీక్షించిన తర్వాత మూడో అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. బ్యాట్‌ క్రీజు గీత దాటి లోపలికి రాలేదని, అది ఔటేనని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సహా ఆటగాళ్లు, అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అప్పుడు స్టోక్స్‌ స్కోరు 31. ఆ టైమ్ లో థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చి ఉంటే.. మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చేది. గెలిచేదని అంటున్నారు.