తెల్లారితే గురువారం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే ?

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా నటించిన రెండో చిత్రం ‘తెల్లారితే గురువారం’. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు మణికాంత్ దర్శకత్వం వహించారు. కీరవాణి పెద్ద కొడుకు కాల భైరవ సంగీతం అందించారు. వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మించాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలని పెంచేశాయి. భారీ అంచనాల మధ్య తెల్లారితే గురువారం ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు మణికాంత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘పెళ్లి నేపథ్యంలో సాగే కథ ఇది. పెళ్లి కొడుకు పెళ్లి మండపం నుంచి ఎందుకు పారిపోయాడు? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అనేదే ఆసక్తికరం. గోదావరి యాసలో సాగుతూ మంచి వినోదం పంచుతుంది. ముఖ్యంగా సత్య, హీరో మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి’ అని మణికాంత్ చెప్పుకొచ్చారు. ఇక మణికాంత్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అట. తారక్ తో సినిమా చేయడమే తన లక్ష్యమని మణికాంత్ తెలిపారు. మరీ.. తెల్లారితే గురువారం హిట్ కావాలని.. తారక్ తో సినిమా చేయాలనే ఆయన కోరిక తీరాలని ఆశిద్దాం.